Showing posts with label బ్లాగోళ జంభ. Show all posts
Showing posts with label బ్లాగోళ జంభ. Show all posts

Wednesday, June 25, 2008

బ్లాగదాభి రామ బ్లాగర -- 6

* * * * * * * *


ఆచరణ శుద్ధి లేని ఆటోపబ్లాగది ఏల
భావశుద్ధి లేని పోస్టుయది ఏల
చీర్ శుద్ధి లేని స్పామువాగుడేల
బ్లాగదాభి రామ బ్లాగర విహారి

మరిన్ని బ్లాగదాభి రామ పద్యాలకు 'బ్లాగదాభి రామ' లేబులు నొక్కండి
* * *


ఆత్మ శుద్ధి లేని ఆచారమది ఏల
భాండ శుద్ధి లేని పాకమది ఏల
చిత్త శుద్ధి లేని శివ పూజలేలర
విశ్వదాభి రామ వినుర వేమ
* * * * * * * *

Wednesday, June 04, 2008

ప్రమదావనంలో నేను

:::::::::



నా కళ్ళకు ర్యాండం గుణమెక్కువ. ప్రమదా వనం అని పేరు పెట్టినప్పుడే నా తడబడే కళ్ళు ఆ పేరును ప్రమాద వనం లా చదివాయి. అలాంటిది అతిథిగా రమ్మంటే కళ్ళే కాదు ఒళ్ళు కూడా తడబడ్డం మొదలైంది. కాలేజీలో వున్నప్పుడు ఎవరైనా అమ్మాయిలు మాట్లాడితే గొంతు తడారిపోయేది. సినిమాలకు రమ్మని పిలిచిన అమ్మాయిలకైతే ఆ సినిమా థియేటర్ లోనుండి ఎత్తేసే వరకు కనిపించే వాడిని కాదు. ఆడవాళ్ళతో మాట్లాడాలంటే మా అవ్విచ్చిన ధైర్య రసమూ, మాధీఫల రసాయనమూ సమ పాళ్ళలో కలుపుకుని కంచు గ్లాసులో తాగి వెళ్ళే వాడిని. ఇప్పుడు మా అవ్వలేదు, మాధీఫల రసాయనమూ లేదు. మా ఆవిడ నడిగితే అవేంటో తెలీదు అంటుంది. జీవితంలో ఎప్పుడో ఓ సారి రిస్కు తీసుకోక తప్పదని తెలిసింది. అప్పుడే పెళ్ళి కూడా చేసుకున్నా. అలా ఆ రిస్కు తో కొంత ధైర్యం వుంది కాబట్టి అతిథిగా వస్తానని చెప్పేశా.ఆ రోజు డంకనక డంకనక... డంకనక డంకనక... అని వచ్చేసింది. భయ పడుతూ పడుతూ ప్రమాదావనం లో అడుగు పెట్టేముందు



ఇలా వెళితే






అలా బయటికి వస్తానని అనుమానిస్తూ పిల్లిలా అడుగు పెట్టా.




అలా బొమ్మలు మాత్రమే పెట్టేస్తే బ్లాగు లోకానికి అన్యాయం చేసినట్టవుతుంది.అక్కడేమి జరిగిందో తోటి మగ బ్లాగర్లకు చెప్పకపోతే మగ పుట్టకే వేస్టు అంతే కాకుండా మగ బ్లాగు లోకానికి ద్రోహం చేసిన వాడనై నరకాని కెళితే అక్కడ ఆడ రాక్షసుల చేత శిక్షింపబడతానని గ్రహించి ఇప్పుడు రాస్తున్నా.

అది శాలి వాహన శక సంవత్సరం 1930...
స్వస్తి శ్రీ సర్వధారి నామ సంవత్సరం....
వైశాఖ శుధ్ధ చతుర్దశి......
వర్జ్యం లేదు.

సమయం: భారత్ లో ఎగిరే పక్షులు ఇంటికి చేరుకునే సమయం. ఉద్యోగ పక్షులు ఏడుస్తూ పార్కుల నుండి ఇంటికి చేరుకే సమయం.
అమెరికా లో బ్రష్షు బదులు కాఫీ నోట్లోకి తోసే సమయం.

ధైర్యే సాహసే ఉబ్బసమే దగ్గు అని 11 సార్లు అనుకొని ప్రమదా వనం లో అడుగు పెట్టా. నేను అడుగు పెట్టేసరికి కొందరు పెద్ద మహిళా బ్లాగర్లు వచ్చి వెళ్ళి పోయారు. (హమ్మయ్య…మొదటి హమ్మయ్య) అప్పుడు అక్కడున్న బ్లాగరులు జ్యోతక్క, రాధిక, సుజాత శ్రీనివాస్, నిషిగంధ, తెరెసా, వరూధిని వున్నారు. ఇంకా రేణు కూడా మధ్యలో వచ్చి వెళ్ళారు.

కాసేపు పిచ్చాపాటి కబుర్లు నడిచాయి. పిచ్చా పాటి అంటే జన్మ కుండలాలు, జాతక నక్షత్రాలు తెల్సుకోవడమన్నమాట.

అప్పటికి వాతావరణం బావుంది (హమ్మయ్య రెండో సారి. ఐడియా హమ్మ హమ్మ కాదు )

అవన్నీ అయిన తరువాత మెల్లిగా మాటలు చెబుతూ “స్వాగతం దొరా….సుస్వాగతం..” అని ఉష్ణ పీఠం ఎక్కించారు. అదేదో బొబ్బిలి బ్రహ్మన్న సింహాసనమనుకొనేరు. ఎక్కి కూచుంటే కానీ దాని శక్తి తెలీదు. తరువాత మొదలైంది ప్రశ్నల పరంపర. (ఇంక హమ్మయ్యాలు లేవు గమనించగలరు)

మీదే ఊరు?
మేము కొండ దొరలం, కొండల్లో వుంటాం. మంచు కురుస్తుంది కదా మంచు దొరలం కూడా.

గర్లు ఫ్రెండ్స్ వున్నారా?
ఫ్రెండ్సులో గర్ల్సు లేరు.

మీది ప్రేమ వివాహమా?
పెళ్ళయిన తరువాత ప్రేమించిన వివాహం.

మీ ఆవిడ ఇండిపెండెంటా, డిపెండెంటా?
నా మెళ్ళో పెండెంటు.

మీ దగ్గరకో అందమైన్ డబ్బున్న అమ్మాయొచ్చి పెళ్ళి చేసుకుంటా నంటే ఏమంటారు.
ఎగిరి గంతేసి చేసుకుంటా

ఇద్దరూ కలిసే వుండాలంటే ఏమి చేస్తారు?
వాళ్ళు కొట్లాడు కోకుండా ఒకరికి ఈ టి.వి. పెట్టి ఇంకోకరికి కూడలి చూపిస్తా.

మీకు బ్లాగడానికి అవిడియాలు ఎలా వస్తాయి?
చిన్నప్పుడు ఎక్కువగా దొంగతనాలు చెయ్యడం వల్ల. ఇప్పుడు చేయిస్తున్నా.

మీరు సరదాగా వుంటారా , మూడీగా వుంటారా?
సరదా మూడ్ లో వుంటా.

మీ హైటెంత?
సిక్స్ టూ సిక్సు.

మీరేం చేస్తుంటారు?
పిల్లల చేత మారాం చేయిస్తుంటా.

అమెరికా ఎందుకెళ్ళారు?
విమానెక్కాను కాబట్టి

మీరు మందు కొడతారా?
అవును ఇక్కడ మా చెట్లకు తెగులు ఎక్కువ.

మీ కిష్టమైన బ్లాగు
విహారి

అది కాకుండా ఇంకోటి
ఇదీ నా మది

ఊహూ అది కాకుంటా ఇంకొకటి
నాటకాలూ..వగైరా

మీకు తిరకాసోడు అని పేరుందా
అవును నాదగ్గర ఎప్పుడు త్రీ కాసులే వుంటాయి. ఫోర్ కాసులు(నాలుగు రాళ్ళు) వుండవు.

అందరూ హాస్యంగా రాస్తున్నారు గదా మీరు కుళ్ళు కుంటున్నారా?
అవును. బండకేసి బాదుకుంటున్నాను. అందుకే ఇకమీదట సీరియెస్ టపాలు రాస్తాను.

(ప్రమదా వనం కొంత సేపు కంపించింది. రాధిక కంప్యూటరును గట్టిగా బాదడం వల్ల తన కంప్యూటరుకు పగుళ్ళు వచ్చాయి. సరే హాస్యం రాస్తాను అన్న తరువాత అన్నీ సవ్యంగా పని చెయ్యడం మొదలు పెట్టాయి)

అలా రాసుకుంటూ పోతే చాలా వున్నాయి. ఉష్ణ పీఠం మీద నుండి దిగిన తరువాత నేనెలా అయిపోయానో నని మీకు అనుమానం కదూ. అట్ల తద్దోయ్ ఆరట్లోయ్..బాతు గుడ్డోయ్..ఆమ్లెట్లోయ్.. అని పాట పాడుకున్నానని మీ అనుమానం కదూ. మీ అనుమానం తీర్చుకోవడానికి ఈ కింది బొమ్మ చూడండి. (మైసూర్ మహరాజ్)



మొత్తానికి భూమి మీద నున్న అన్ని ఖండాల లలనాంగనలు అందరూ చేటలు వదిలేసి ఒక్క చోట ముచ్చట్లు పెట్టుకోవడం బావుంది. రేపో మాపో వీవెన్ స్క్రీన్ మీద రాసే సదుపాయమిస్తే సంక్రాంతి ముగ్గులు వేసుకోని గొబ్బెమ్మలు పెట్టేసి హైటెక్ చేస్తారు. ఎవరైనా మహిళామణులు మిస్సయితే తప్పకుండా వెళ్ళి ఆ వనం లో విహరించండి.


గమనిక:
ఇందులో కొన్ని కల్పితాలున్నాయి.


:::::::::

Friday, May 30, 2008

ఎప్పుడూ ఒదులుకోవద్దురా భాషను....

:::::::::

అసలు పాట ఆడియో ఇక్కడ

ఎప్పుడూ ఒదులుకోవద్దురా భాషను
ఎప్పుడూ వీడిపోవద్దురా బ్లాగును

విశ్రమించవద్దు ఏ క్షణం
విస్మరించవద్దు నీ కోణము
అప్పుడే నీ బ్లాగురా... నీదిరా...

ఎప్పుడూ ఒదులుకోవద్దురా భాషను
ఎప్పుడూ వీడిపోవద్దురా బ్లాగును

జాలమెంత గొప్పదైన బ్లాగుకున్న టపాలల్ల
పదునుముందు సద్దుమణుగురా
గూగులెంత పెద్దదైన ఎదుగుతున్న తెలుగుశైలి
మొక్క ముందు చిన్నదేనురా

యాడులోన యాడొ వుండి సిస్టం ని మింగు స్పైయ్యివేరు
ఒక్కనాడు నెగ్గలేదురా
గుటకపడని బ్లాగరుండ చీపుట్రిక్కులెంచుకుంటు
అడుగుహిట్ల మునుగుతుందిరా

దోష దారులెంతసేపురా
భాషోదయాన్ని ఎవ్వడాపురా
వెలుగుతున్న బ్లాగు కూడా శౌర్యగోళమంటిదేనురా

ఎప్పుడూ ఒదులుకోవద్దురా భాషను
ఎప్పుడూ వీడిపోవద్దురా బ్లాగును

నొప్పి లేని నిముషమేది లైవు యైన స్క్రాపు యైన
ప్రాజెక్టు అడుగుమడుగునా
బాసుచూసెనంటు నిలిచిపోతే కూడలైన నీది కాదు
బ్లాగు అంటే బాహ్య ఘర్షణ

శైలి వుంది శిల్పముంది
కూడలుంది జల్లెడుంది
అంత కన్న సైన్యముండునా

వ్యాఖ్య నీకు వాయువౌను
క్లిక్కు నీకు కీర్తనౌను
సమీక్ష నీకు సారధౌనురా

భీతిలేని బ్లాగుడున్నదా
సాహిత్యమంటు శిశువు పుట్టదా

అగ్రిగేటరంటు వున్న వరకు
భీరువంటు పారిపోక
బ్లాగు పైన భాషపతాక మెగురవేయరా…

ఎప్పుడూ ఒదులుకోవద్దురా భాషను
ఎప్పుడూ వీడిపోవద్దురా బ్లాగును

********************


ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..
ఎప్పుడూ ఒదులుకోవద్దురా ఓరిమి.

విశ్రమించవద్దు ఏ క్షణం.
విస్మరించవద్దు నిర్ణయం.
అప్పుడే నీజయం నిశ్చయం రా.
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..

నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వ పిల్ల
రెక్క ముందు తక్కువేనురా
నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వ పిల్ల
రెక్క ముందు తక్కువేనురా

సంద్రమెంత గొప్పదైన ఈదుతున్న
మొప్ప ముందు చిన్నదేనురా
పశ్చిమాన పొంచి వుండు రవిని మింగు అసుర సంధ్య
ఒక్క నాడు నెగ్గలేదురా
గుటకపడని అగ్గి విండ సాగరాల నీదు కుంటు
తూరుపింట తేలుతుందిరా

నిషావిలాసమెంత సేపురా
ఉషోదయాన్ని ఎవ్వడాపురా
రగులుంత గుండె కూడ సూర్య గోళమంటిదేనురా

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..

నొప్పిని లేని నిమిషమేది జననమైన మరణమైన
జీవితాన అడుగు అడుగునా
నొప్పిని లేని నిమిషమేది జననమైన మరణమైన
జీవితాన అడుగు అడుగునా
నీరశించి నిలిచిపోతే నిమిముషమైన నీది కాదు
బ్రతుకు అంటే నిత్య ఘర్షణ.

దేహముంది ప్రాణముంది
నెత్తురుంది సత్తువుంది
ఇంతకన్న సైన్యముండునా...

దేహముంది ప్రాణముంది
నెత్తురుంది సత్తువుంది
ఇంతకన్న సైన్యముండునా...

ఆశ నీకు అస్త్రమవును..
శ్వాశ నీకు శస్త్ర మవును.
ఆశయమ్ము సారధవునురా

నిరంతరం ప్రయత్నమున్నదా
నిరాశకే నిరాశ పుట్టదా
నిరంతరం ప్రయత్నమున్నదా
నిరాశకే నిరాశ పుట్టదా

ఆయువంటు వున్న వరకు చావు కూడ నెగ్గలేక.
శవము పైన గెలుపు చాటురా
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..


సిరివెన్నెల గారికి క్షమాపణలతో

Tuesday, May 27, 2008

పండంటి బ్లాగుకు పదకొండు సూత్రాలు(కొత్త బ్లాగర్ల కోసం మాత్రమే) -- 2

:::::::::

మొదటి భాగం చదివి కాళ్ళు, చేతులు, మొఖమూ కడుక్కోని శుచిగా ఇక్కడికి రండి.అలా న్యూస్ రీల్ అయిపోయిన తరువాత సినిమా ఇలా మొదలవుతుంది.

ఈ సూత్రాలు రాసే ముందు ఒక్కో సూత్రాన్ని విశ్లేషించి ఒక్కో రీలు ఒక్కో టపాగా రాద్దామనుకున్నా కానీ ఇప్పటికే సినిమా రెండో భాగం లో వేసినందుకు కొంత మంది థియేటర్ అభిమాన ప్రేక్షకులకు కోపమొచ్చినందున మొత్తం 11 సూత్రాలు ఇక్కడే ఇచ్చేస్తున్నా :-)


1. బ్లాగు ముఖ్యోద్ధేశ్యం:
మొట్ట మొదటగా బ్లాగును మీరు ఏ ఉద్ధేశ్యంతో ప్రారంభించారు. అందరి నోళ్ళలో నానాలని ప్రారంభిస్తున్నారో లేక మీ వ్యక్తిగత ఆనందం కోసం ప్రారంభిస్తున్నారో లేక గూగులు ప్రకటనలతో నాలుగు రాళ్ళు సంపాదిద్దామని మొదలు పెట్టారో నిర్ణయించుకోండి.


2. ముద్రారాక్షసాలు :
మీరు మొదటిసారిగా టపా రాసేప్పుడు ముద్రణా దోషాలు తప్పవు. ముద్రణా దోషాలు వుంటే మాత్రం చికాకు కలిగించే అంశం.టపాలో వున్న విషయాన్ని బట్టి పాఠకులు స్పందిస్తుంటారు. మొదట్లోనే ఆహా, ఓహో అనిపించేట్టు రాయక పోయినా ఇబ్బంది పెట్టే ముద్రణాదోషాలు రాయొద్దు. ఇప్పుడు బ్లాగులు చాలా ఎక్కువయ్యాయి సావధానంగా చదివి ముద్రణా దోషాలకు స్పందించే వాళ్ళు తక్కువే అని గుర్తు పెట్టుకోవాలి.


3. ఎలా రాయాలి?:
1 పరుగు, 12 బంతులు, అయిదు వికెట్లు వున్నా కూడా గెలుస్తామో లేదో అని టెన్షన్ పడే హైదరాబాద్ డెక్కన్ చార్జర్స్ అభిమాని లాగా కాకుండా 6 బంతులు, 36 పరుగులు, 1 వికెట్ వున్నా తప్పకుండా గెలుస్తామనే రాజస్థాన్ రాయల్సు అభిమాని లాగా ఆత్మ విశ్వాసంతో రాయాలి. మీరేది రాసినా దాన్ని రెండు మూడు సార్లు సమీక్షించుకొని ప్రచురించడం మంచిది. రాసే విషయం లో స్పష్టత అవసరం. బ్లాగుల్లో మన ఇష్టమొచ్చింది రాసుకోవచ్చు కానీ ఆదరణ కావాలంటే మాత్రం స్పష్టత అవసరం. ఇవే ఎక్కువ కాలం మనగలుగుతాయి. మీ టార్గెట్ ఆడియెన్సు ఎవరో ముందుగా తెలుసుకొని అలాంటి వాటి మీద బ్లాగటం ఒక పద్దతి. అలా కాకపోతే మీకు పట్టున్న వాటి మీద మొదలు పెట్టి తరువాత అన్ని రంగాల్లోనూ దూకడం మంచిది. మీ బ్లాగు విజయవంతం కావాలంటే సృజనాత్మకత, పుస్తక పఠనం, స్పష్టత వుండాలి.


4. కొన్నాళ్ళకు ఏమి రాయాలి?:
మొదట్లో మీ దగ్గర వున్న డ్రీమ్‌ ప్రాజెక్ట్స్ అన్నీ రాసేశారు. తరువాత రాయడానికి ఏమీ లేదు ఏమి చేయాలి అని అనుకున్నప్పుడు కాలేజీలో రంగారావు చొక్క జేబులోనుండి రెండు రూపాయలు కొట్టేసి మస్తాన్ కొట్లో వన్ బై త్రీ టీ తాగేసిన విషయం వ్రాయండి. వీలయితే లైబ్రరీకి వెళ్ళి మీకు నచ్చిన పుస్తకం/సినిమా తెచ్చి దాని మీద మీ విశ్లేషణ చెయ్యండి. అలా రాస్తూ పోతే పాఠకులకు మీ మీద ఒక గురి ఏర్పడుతుంది. మొదట్లో అత్యుత్సాహానికి పోయి భూమండలాన్ని బుట్టలో పెడతా, నక్షత్ర మండలాన్ని నాన పెడతా, ఉట్టి మీది వెన్న మింగేస్తా అనే భారీ డవిలాగులు చెప్పకుండా సావధానంగా రాయండి.(నేనయితే ఏ అవిడియా రాకపోతే ఎవరు నేను, ఎవడ్రా రౌడీ, ఎవడైతే నాకేంటి లాంటి సినిమాలు చూస్తా. చప్పున ఓ అవిడియా వస్తుంది.)


5.మీ బ్లాగును ఆదరిస్తున్నారా?:
అన్నింటికి మించి బ్లాగులు రాసిన తరువాత ఆదరణ లేదని నిరుత్సాహానికి గురి కావటం. ఇందాక చెప్పినట్లు ఇది బ్లాగు ప్రయాణం. అందులో ముందుగా రైలెక్కిన వారికి పాత వాళ్ళతో ఎక్కువ పరిచయ ముండటం సహజం. ఆ చనువుతో కొత్త వారికన్నా పాత వారితో పలకరింపులు ఎక్కువుంటాయి. అంతే. అంత మాత్రం చేత మీరు రాసిన వాటికి ఆదరణ లేదని అనుకోవద్దు. కొన్ని టపాలు కేవలం పది మంది చదివి ఆ పది మంది కామెంట్లిచ్చినంత మాత్రాన మీరు రాసింది తక్కువని కాదు. మీ బ్లాగుకు ఎంత మంది వస్తున్నారు అని తెలుసుకోవడానికి స్టాట్ కౌంటరు లాంటివి పెట్టుకోవడం మాత్రం మరచి పోవద్దు. ఇంకా మై బ్లాగ్ లాగ్ లాంటివి వున్నాయి. దీని ద్వారా మీ బ్లాగుకు ఎంత మంది వచ్చారు అన్నది తెలుసుకోవచ్చు. ఏది రాసినా మంచి బ్లాగుకు ఆదరణ వుంటుందన్న విషయం మరచి పోవద్దు.


6. మీ బ్లాగు పదుగురిలో :
మీరు ఒక్క సారి బ్లాగు ప్రారంభించిన తరువాత బ్లాగు అగ్రిగేటర్లతో నమోదు చేసుకోవడం తో మీ పని అయిపోదు. అప్పుడప్పుడూ మీ ఆలోచనలకు సరిపోయే బ్లాగులను చదివి కనీసం నాలుగు లైన్ల కామెంట్లు వ్రాయండి. అలా వ్రాస్తే ఆ బ్లాగు వాళ్ళకు కూడా మీ బ్లాగు మీద ఆసక్తి కలగొచ్చు. ఇది పరస్పర డబ్బా కాకుండా చూసుకోండి. వచ్చిన కామెంట్లకు స్పందించడం మరిచి పోకండి. (ఇక్కడ మాత్రం నన్నొగ్గేయండి. నేను స్పందిస్తున్నానా అని ప్రశ్నించకండి. నేను దొంగయితే దొంగతనం చెయ్యొద్దు అని చెప్పడం మంచి మాటే కదా )ఈ మధ్యనే బ్లాగు ప్రారంభించిన బొల్లోజు బాబా గారి కామెంట్లు పరిశీలించండి. ఆయన రాసిన ప్రతి కామెంటూ స్పష్టంగా వుంటుంది. ఆయన కామెంటు రాయని బ్లాగు బహుశా లేదేమో.

ఎవైనా సీరియస్ విషయాల మీద వ్యాఖ్యానించే ముందు. రాసిన వ్యాఖ్యలను ఒకటికి రెండు సార్లు చూసుకొని వ్యాఖ్యానించడం మంచిది ఎందుకంటే తరువాత చదివేవాళ్ళు మీ వ్యాఖ్యను విభిన్న కోణాలలో పలు సార్లు స్పృజించి వ్యాఖ్యానిస్తారు. అందులో మీరు చెప్పాలనుకున్నది కాకుండా దానికి వ్యతిరేకార్థం స్పురించొచ్చు.


7. బ్లాగులో ఎన్ని రాయాలి?:
ఎన్నయినా రాయొచ్చు చెత్త రాయనంత కాలం.మీరు రాయటం మొదలు పెట్టిన తరువాత కనీసం రెండు వారాలకొక టపా రాయడం మరిచిపోవద్దు. రాయక పోతే జనాలు మిమ్మల్ని మరిచి పోతారు.


8. తెలుగు బ్లాగులలో ఎలా నడుచుకోవాలి?:
ఇప్పటి వరకు తెలుగు బ్లాగులన్నీ సుహృద్భావ వాతావరణం లో నడుస్తున్నాయి. వుంటే సైద్ధాంతిక విభేదాలుండొచ్చు గానీ వ్యక్తిగత విభేదాలను పెంచుకోవద్దు. ఎవరైనా వ్యక్తిగత విమర్శలకు దిగితే అనవసరంగా నోరు(బ్లాగు) పారేసుకోవద్దు. మనమేం మానవాతీతులం కాదు. అప్పుడప్పుడూ తేలిక పాటి యుద్ధాలు నడుస్తుంటాయి. వాటికి ఫిరంగులు ఫిక్సు చెయ్యకండి. విమర్శనాత్మక చర్చల్లో పాల్గొన్న బ్లాగులో వచ్చిన తరువాతి టపాకు సానుకూలంగా లేదా ఘర్షణాత్మక వైఖరికి దూరంగా స్పందించండి. అది చాలు అంతరాలు తుడిచి పెట్టుకు పోవడానికి. అలా అని మీరు అవతలి వ్యక్తి అభిప్రాయాలను, ఆలోచనలను అంగీకరించినట్టు కాదు.


9. నేను బాగానే రాస్తున్నానా?:
అక్కడక్కడా బ్లామీక్షలు (సమీక్ష) చూసి అందులో నా టపా లేదేంటబ్బా అని భాధ పడకండి. అవన్నీ వ్యక్తిగత ఇష్టాలు అయుండచ్చు. రాస్తూ వుంటే మీరే పెద్ద బ్లాగరు. మీరే పెద్ద సమీక్షకుడు/సమీక్షకురాలు.


10. ఏవి రాయకూడదు?:
బ్లాగుల్లో వ్యక్తిగత విషయాలు ఎక్కువగా రాయకుండా వుంటే మంచిది. రాసినా తగు జాగ్రత్తలు తీసుకోని రాయండి(ప్రత్యేకంగా ఆడవాళ్ళు). బ్లాగుల్లో ఎక్కువగా చిన్న తనం లో జరిగిన విషయాలు, జీవితానుభవ పాఠాలు రాయడం కద్దు. అలా రాసేప్పుడు అందులోని వ్యక్తుల పేర్లు మార్చి రాయడం మంచిది. ఇంకా అంతర్జాలం చీకటి కోణమెటువంటిదో తెలుసుకోవాలంటే సాలభంజికల మరో మెట్టు చదవండి.


11. బ్లాగులే జీవితం కాదు:
బ్లాగుల ద్వారా ఎన్నో మంచి విషయాలు తెలుసుకోవచ్చు. ఎంతో మంచి రచనలతో, పెద్ద రచయితలతో పరిచయభాగ్యం జరగచ్చు. మీ ఆలోచనలను ఇతరులతో పంచుకుని వ్యక్తిత్వ వికాసానికి సాయ పడవచ్చు. కానీ మీ వ్యక్తిగత జీవితాలను, దైనందిన వ్యాపకాలను పక్కన పెట్టే అంతగా వుండకూదదు. మీరు అంతర్జాలం లో దొరికే అడ్డమైన చెత్తా చదివే వాళ్ళయితే మాత్రం తెలుగు బ్లాగులు మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది.

చివరగా వీవెనుకు జల్లెడోళ్ళకు ఓ సలహాభ్యర్థన : కూడలి రైలు పెట్టెకి కూడలండ్రెడ్ లా 'లేత బ్లాగర్లు' అనే పెట్టె తగిలించమని అభ్యర్థన. ఇందులో గత వందరోజులలో నమోదు అయిన లేదా ప్రారంభించబడిన బ్లాగులు వుంటే వారిని ప్రోత్సహించడానికి అనువుగా వుంటుంది.

అనంద బ్లాగింగ్ (Happy blogging)
:::::::::

Wednesday, May 21, 2008

పండంటి బ్లాగుకు పదకొండు సూత్రాలు(కొత్త బ్లాగర్ల కోసం మాత్రమే) -- 1

:::::::::

మట్టిబుర్ర, ఒట్టి బుర్ర, తొట్టి బుర్ర, బంక బుర్ర కాదేదీ బ్లాగడానికి అనర్హం

అదేమిటి సూత్రాలేవన్నా వుంటే పది వుండాలి లేకుంటే పన్నెండు వుండాలి కానీ అనుకుంటున్నారా?
అక్కడే చూపించాలి కొత్తదనం. ఆ కొత్తదనం అనేది వైవిధ్యంగా వుండాలి. వైవిధ్యం పేరు చెప్పి నన్నయా, తిక్కనా క్లాస్ మేట్స్. వాళ్ళిద్దరూ ఎదురు బొదురు ఇళ్ళలో వుండే వాళ్ళు అని చెప్పేస్తే బ్లాగులోకి బుల్లెట్లొస్తాయ్. కొంచెం ప్రత్యేకంగా చెప్పాలి.

సరేనోయ్ ఇదెందుకు రాస్తునావో ఒక ముక్క చెబ్తావా?
గత ఆర్నెల్లుగా బ్లాగులు రాసే వాళ్ళు ఎక్కువయ్యారు. ఎక్కువయ్యారు అంటే మొదలు పెట్టే వాళ్ళు మాత్రమే ఎక్కువయ్యారు అని అర్థం. అవి కొనసాగించే వాళ్ళు చాలా తక్కువ మందయ్యారు. బ్లాగు పేర్లు నమోదు చేసుకొన్న వాళ్ళు చాలా మంది. అలా నమోదు చెయ్యడం కూడలి లో కావచ్చు, జల్లెడ లో కావచ్చు, తేనె గూడు లో కావచ్చు, తెలుగు బ్లాగర్స్ లో కావచ్చు. ఇంకా చక్రెడో అని ఒకటుందనుకుంటా. ఇప్పుడు ఇండీబ్లాగర్స్ అని ఒకటి వచ్చింది. అలా ప్రారంభించిన లెక్క చూస్తే ఎనిమిది వందలకు పైగా వుండొచ్చు. మొన్నా మధ్య కూడలి కొచ్చే యునీక్ హిట్లు ఎంత అని వీవెన్ ను అడిగితే సాధారణ రోజుల్లో 300+. వారాంతాల్లో ఇంకా తక్కువ అన్నారు. నేనయితే ఈ ఎనిమిది వందలు కాకుండా ఇంకో అయిదు వందలు ఉంటారు. తక్కువలో తక్కువ ఓ వెయ్యి మంది రోజూ బ్లాగులు చదువుతుంటారనుకొన్నా. వాస్తవంగా అది నిజం కాదు అని తెలిసి కళ్ళలో నీళ్ళు కారబోతుంటే స్పాంజి పెట్టి ఆపి బాధ పడ్డా. జల్లెడ, తేనె గూడు, తెలుగ్ బ్లాగర్స్కు ఎంత మంది వస్తారో తెలీదు(కనుక్కోలేదు సరైన సమాచానం).

బ్లాగులంటే ...
అమెరికాలో అయితే "హౌ టూ డ్యాష్ ఎఫెక్టివ్లీ" (డ్యాష్ ఖాళీలో ఏదైనా పూరించుకోండి) అని ఒక పుస్తకం రాస్తే మూణ్ణెల్లలో ఆరు ముద్రణలకు నోచుకుంటుంది. డిల్లీ సెంట్రల్ హాల్లో లైట్లేసి ఆ రచయితకు కలువభూషణ్ అని బిరుదు కూడా ఇస్తారు. మన తెలుగు వాళ్ళు అట్టే పుస్తకాలు (కొని) చదవరు. ఎక్కడన్నా పుస్తకం దొరికితే "మాస్టారూ, దీన్ని పట్టుకెళ్ళి చదివేసి రేపు ఉదయం మీ ఇంటి ముందు మీరు ముగ్గెయ్యక ముందే తెచ్చిస్తా" అంటారు. ఆ పుస్తకం తిరిగొస్తే టి.వి.యాంకరమ్మ తెలుగు మాట్లాడినంత ఒట్టు. ఇప్పుడు పుస్తకాలు కొనే వాళ్ళు తక్కువై పోయారు. వీళ్ళందర్నీ లైన్లో నిలబెట్టి ఆ లైన్లో నడుచుకుంటూ ముందుకు వస్తే నా మొహం రెండోది అయుంటుంది.అరువు ఇచ్చేవాళ్ళు అంతకన్న తక్కువై పోయారు. పాపం వీళ్ళనెందుకు అవమానించడం అని వీళ్ళని కూడా లైన్లో పెడితే, ఈ లైన్లో నా మూడు క్యాండిల్స్ మొహం మొదట కనిపిస్తుంది. ఇప్పుడు ఆ పుస్తకాల కొరత తీర్చడానికి అంతార్జాలమొచ్చింది. దాదాపుగా ఏది కావాలన్నా అందులో దొరుకుతుంది. దాని నెత్తి మీద గూగులొచ్చింది. అందువల్ల పుస్తకాలు కొనే వాళ్ళు లేరు, అడుక్కునే వాళ్ళు లేరు. ప్రతి దానికి గూగ్లేయడమే.(కొంత మంది పద్దతి గా అజో విభో ఫౌండేషన్‌ కి వెళ్ళి పుస్తకాలు కొంటారు) అలా వెబ్ లో చాలా విషయాలు లాగుతున్న వాళ్ళ లోంచే పుట్టికొచ్చిందే ఈ బ్లాగ్.

అందులో తెలుగు వాళ్ళు లేకపోతే ఈ టపా రాసే అవసరముండేది కాదు. అలా ఎప్పుడూ తెలుగు వార్తలు, కథలు, నవలల కోసం వెదుకుతున్న వాళ్ళందరూ కలిసి ఈ వెదుకులాటకు ఏదైనా పేరు పెట్టాలనుకొన్నారు. కానీ మన పక్క నున్న పక్క రాష్ట్రం వాళ్ళు వుంటే తమ పేరు పెట్టుకోవడం కష్టమని గ్రహించి వాళ్ళందర్ని ఒక రూములో కట్టేసి, పులిహోర పేకెట్లు, దద్ధోజనం పేకెట్లు ముందర పడేసి దీనికి "వెబ్ లో లాగుడు" అని పేరు పెట్టారు. కాల క్రమేణా అది "వెబ్ లాగుడు" అయింది. ఇది చూసిన ఫ్రెంచి వాళ్ళు, డచ్చి వాళ్ళు "మాకు డు పలకడం రాదు" అని దానికి "వెబ్ లాగు" అని పేరు పెట్టారు. తెలుగుకు ప్రాచీన భాష హోదా ఇవ్వక పోయిన ఫరవా లేదు కానీ నవీనంగా మేము కనిపెట్టినదాని పేరు మారుస్తారా? అని అడ్డం పడ్డారు మన వాళ్ళు. "లాగు అంటే మా ఐ.ఎస్.ఐ. మార్కు పట్టా పట్టీల నిక్కరు కాబట్టి మేమొప్పుకోం" అని తెలిసినోళ్ళందరికీ ఈ-మెయిల్ పంపించారు. ప్రతి ఈ-మెయిల్ లో కింద మీరొక్కరికి ఫార్వర్డ్ చేస్తే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఆరు సెంట్లిస్తారు అని నోట్ కూడా పెట్టారు. సరిగ్గా ఈ సమయం లోనే పంధ్రాగస్టు స్పీచిలు టి.వి.లో చూడ్డం జరిగింది. సో అందరూ అదొక ఉద్యమంగా తీసుకొని ఈ డచ్చి వాళ్ళని ఇప్పుడే ఆపకపోతే తరువాత బ్రిటీషు వాళ్ళొస్తారు ఆ తరువాత నెహ్రూ ఫ్యామిలీ వాళ్ళు వచ్చేస్తారు అని డచ్చి వాళ్ళ మీద తిరుగుబాటు చేశారు. పిల్లులు రొట్టె కోసం పోట్లాడుకుంటుంటే కోతి రావాలి కదా వెంటనే అదోచ్చి (పజిల్: ఎవరో మీరే చెప్పుకోవాలి) "వె..వ్వె..వ్వె.." అని వె పీకేసి "బ్లాగు" అని నామకరణం చేశారు. ఎవరన్నా బ్లాగు ఎలా పుట్టిందని వేరే వాళ్ళు చెబితే నమ్మకండి. ప్రత్యేకంగా పశ్చిమ దేశస్తులను. మీ ఇంట్లో పెద్ద రాళ్ళు గట్రాలుంటే వాటి మీద ఈ స్టోరీ ఎక్కించేసి మీరు నీళ్ళకోసం తవ్విన ఖాళీ బావిలో పెట్టి చుట్టూ రెండు పాత రాగి రేకులు వేసి పాతెయ్యండి. పాతేసి మన తెలుగు ప్రాచీనాన్ని కాపాడండి.
ఈ టపాకి సంబందించిన బ్లాగు నిర్వచనం అయి పోయింది.


మీరు కొత్తగా బ్లాగు ప్రారంభించిన తరువాత కామెంట్లు రాక పోవడమో, హిట్లు రాకపోవడమో జరిగి "బ్లాగు గతి ఇంతే.." అని విరహ గీతాలు పాడుకోవద్దు. నా లాగే రాసిన వేరే కొన్ని టపాలకి కామెంట్లొస్తున్నాయి గానీ నాకు రావట్లేదు అని విచారానికి గురి కావద్దు. ఈ బ్లాగు ప్రయాణం అనేది రైలు ప్రయాణం లాంటిది. మీకన్నా ముందే రైలెక్కిన వాళ్ళు ఎక్కువగా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం సహజం. దాన్ని చూసి నిరాశకు లోను కావద్దు.

ఈ బ్లాగు ప్రయాణం లో నాకు కనపడిన రైళ్ళు రెండు ఒకటి 'కూడలి', రెండు 'తెలుగు బ్లాగర్స్'. నేను చూసినప్పుడు అవి మీటర్ గేజీ మీద నడుస్తుండేవి. ముందరో ఇంజెను పెట్టె వెనకో ప్యాసింజెర్ పెట్టె వుండేవి అంతే. ఈ రైల్లో పని చేసే డ్రైవరూ, గ్యాంగ్ మెన్, టికెట్ మాస్టర్ తదితర ఉద్యోగ వర్గమంతా ఎవరో బాగా తెలిసేది. అలాగే అందులో ప్రయాణించే వాళ్ళు కూడా ఒకరికొకరు బాగా తెలిసే వారు. రాను రాను ప్రయాణీకులెక్కువయిపోయారు రైలు పెట్టెలెక్కువయి పోయాయి. కూడలి కయితే ఏ.సి., నాన్ ఏ.సి. లాగా రకరకాల పెట్టెలు కలిసాయి. ఆ పెట్టెలకు పేర్లు పెట్టేశారు కూడలండ్రెడ్ , సాహిత్యం, రాజకీయం, హాస్యం, సేకరణలు, సినిమా అని. ఇప్పుడు అది బ్రాడు గేజీ మీద నడవడమే కాకుండా సూపర్ ఫాస్టు రైలు బండిలా పరిగెడుతోంది. తేనె గూడు కూడా బ్రాడ్ గేజులో కొచ్చేసింది. తెలుగు బ్లాగర్స్ కాస్త స్లోగా నడుస్తోంది. దట్స్ తెలుగు వాళ్ళు కూడా బ్లాగు బాట పట్టారు.

కొత్త బ్లాగోడి మనసు ఎలా వుంటుందో ఫ్ల్యాష్ బ్యాకు లో చదువుకోవాలంటే ఖైదీ నంబరు 300 కెళ్ళి కాసేపు చదువుకోండి.

సుత్తి సరే విషయమెక్కడ?
వస్తునానన్నా వస్తున్నా. అక్కడికే వస్తున్నా. సినిమా మొదలయ్యే ముందు మంచి అడ్వర్టైజ్మెంట్లు వుంటాయి. ఎందుకనుకుంటున్నారు? సినిమా బాగా లేకపోతే అవి చూసిన తృప్తయినా మిగులుతుందేమో అని. అందుకే నేను బోనస్ లు ఇస్తుంటా. ఫ్లాపు సినిమా కెళ్తే ఆడియో సి.డి.లు ఉచితంగా ఇవ్వడమనే ప్రక్రియే నాకు పూర్తి స్పూర్తి.

సరే అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది సినిమా మొదలు పెట్ట వేంటి?
అక్కడే మెక్సికో లో పండించిన పెసర పప్పు లో కాలేశారు. సినిమా థియేటర్ లో అడ్వర్టైజ్మెంట్ తరువాత ఏఁవొస్తుంది? న్యూస్ రీల్ రాదా? అన్నీ చెప్పాలి...ఈఁ

మేము న్యూస్ రీల్ చూసి చాలా కాలమయింది. మీది పాత థియేటరా?
అవును పాత థియేటరే. ఇది నా థియేటరే కాబట్టి న్యూస్ రీలు పూర్తి కాకుండా సినిమా మొదలవదు. డెత్ నట్లు చూడాల్సిందే. ఈ టైములో గేట్లు మూసేస్తాం బయటికెళ్ళలేరు. ఇక న్యూస్ చూడండి.

భారత్ ఇండియా పెద్ద లోగో..
చిన్న లొగో...
ఇంకా చిన్న లోగో...
చిన్న చుక్కయిన లోగో ...
ఏమీ లేని లోగో...

ఇప్పుడు వెనక గ్రవుండు లో పాట

మన్మే హై విశ్వాస్....
మన్మే హై విశ్వాస్....

పాట ఎక్కువ సేపు వుండదు. బట్టీ పట్టేసి పార్లమెంటుకొచ్చి పాడతారని భయం.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సమాచార శాఖ అందిస్తున్న వార్తలు

ఏడమ వైపు తాడు కాలిపోతూ ..కుడి వైపు తొలకరి వాన పడుతున్న వెండి తెర పై..

గూని పల్లెలో శంఖు స్థాపనలు.
కోడి ఈకల పాలెం లో శంఖు స్థాపనలు.
బుట్టాయి గూడెం లో శంఖు స్థాపనలు.
ఐతె పల్లె లో శంఖు స్థాపనలు.

న్యూస్ రీల్ అయిపోయింది.

అసలు సినిమా రెండో భాగంలో మొదలవుతుంది.

:::::::::

Tuesday, May 13, 2008

భ్లాగర్ల కథ ( నా వల్ల కాదు )

తప్పకుండా చదివాల్సింది:

పొద్దులో కొల్లూరి సోమశంకర్ గారు రాసిన బ్లాగర్లకో లేఖ చదివిన తరువాత నా డ్రాఫ్టు తవ్వకాల్లోంచి దీన్ని బయటకు తీసా. ఇది నూరో టపాగా విడుదల చెయ్యాల్సి వుండె. పూర్తి చెయ్యడం చేత కాక దీని బదులు బ్లాగోళ జంభ వీడియో విడుదలచేశా. పొద్దులో రాసిన సోమశంకర్ గారికి అభినందనలు. మీరింకా చదవక పోతే ఓ ట్రిప్పేసి తరువాత ఇక్కడికి రండి. ఒకే అవుడియా పది మందికి వస్తుందనడానికి ఇంకొక ఉదాహరణ. మీ బుర్ర స్క్రీన్‌ పై తళుక్కుమన్న "ఇలాంటివి మాట్లాడ్డం నీ కలవాటే గా" అన్న అక్షరాలు బర బర చెడిపెయ్యండి. మళ్ళీ నా మీద సెటైరెయ్యకండి.

తప్పకుండా చదవాల్సింది ఇంకొంచెం:

కింద రాసిన బ్లాగుల పేర్లే కాకుండా ఇంకా చాలా రాయాల్సి వుంది వాటిని రాయడానికి కుదరక మధ్యలో ఆపేశాను. ఇందులో ఉదహరించ బడ్డ బ్లాగు పేర్లకు, వాళ్ళ అసలు పేర్లకు, వాళ్ళ జీవన విధానానికి, వాళ్ళ బ్లాగు విధానానికి, వాళ్ళ ఉద్యోగాలకు, వాళ్ళ ఇంకా చానా చానాలకు ఏ మాత్రం సంబంధం లేదు.

-- ఇదే నా వీర శూర Disclaimer ...


కథ మొదలయ్యింది :

ఓ తెలుగు విద్యార్థి కి తెర చాటు చందమామ లా తెలుగు కోసం తపన పడుతున్న వాళ్ళెందరున్నారో తెలుసుకుందామనే కుతూహలంతో కలిగింది. పదుగురికి ఏదో చెప్పాలనే తపన రోజు రోజుకీ బలీయమయింది. ఇలా ఒంటరిగా ఊహా ప్రపంచం లో మునిగితే సరిపోదు. తనకున్న తెలుగు తీపి ఇంకా ఎంతమందికుందో తెలుసుకోవానే తలపు కలిగడం ఆలస్యం వెళ్ళి తన అంతరంగాన్ని వాళ్ళ నాన్న కి చెప్పాడు.

అది విన్న వాళ్ళ నాన్న చిత్తూరు నాగయ్య లాగా "ఇలా మనసులోని మాట చెప్పి భాష ఊసులు తెలుసుకోవాలనే భావన కలగడం ఎంతో సంతోషం. తెలుగు భాషా అన్వేషి వై బయలు దేరు. నీ అభీష్ట సిద్ధిరస్తు. ఎక్కడా నిరాశా, నిస్పృహ లకు లోను కాకుండా పారదర్శి వై దిగ్విజయంగా తిరిగిరా. తిరిగి వచ్చిన తరువాత నీవు విన్నవీ-కన్నవీ, అవీ-ఇవీ అన్నీ మాకు వినిపిస్తే మేము వాటిని సంగ్రహాలయం లో భద్రపరుస్తాం నాయానా. ఇదిగో ఇక్కడ నున్న మహిమాన్విత కీలు గుర్రం తీసుకెళ్ళు. దాని మీద కూచుని ఈ శాస్త్రం లో చెప్పబడిన విధంగా మంత్రం జపిస్తే నువ్వు కోరుకున్న చోటకు వెళుతుంది." అన్నాడు.

"అలాగే నాన్నా! తపస్వి అయిన మీరు నాకు ఓనమాలు దిద్దించి అమృత వర్షం లా వేదాల్నీ, పురాణాల్నీ అవపోశన పట్టించి నన్నింతగా తీర్చిదిద్దినరనే విషయం నా మనో ఫలకం పై ఎప్పటికీ వుంటుంది " అని చెప్పి సెలవు తీసుకున్నాడు.

విక్రమాదిద్యుడి సింహాసనానికికున్న సాలభంజికల రూపుతో చెక్కబడిన ఆ కీలుగుర్రాన్ని ఎక్కి మంత్రాన్ని జపించాడు. సౌమ్యంగా ఆ బొమ్మను ఒక్క సారి చరిచాడు. లయ బద్దమైన సవ్వడి చేసుకుంటూ మరుక్షణమే అది స్వేచ్చా విహంగం లా గాలిలోకి ఎగిరింది.

అది నిండు పౌర్ణమి. జాబిల్లి వెన్నెల విరబూసి పసిడి కాంతులు వెదజల్లుతోంది. అలా గాలిలో ఎగురుతూ తను ఇంతవరకూ ఆ అడవి లో తను చూడని ఎన్నో చిన్న చిన్న అందాలను చూసాడు. సన్నని జల్లు కురవడం మొదలైంది. తన ఒంటి మీద పడ్డ చినుకుల్ని చూసి వెన్నెల చినుకులంటే ఇవే నేమో అనుకున్నాడు. కాసేపు సేద దీరుదామని కిందికి దిగాడు. అక్కడ హరివిల్లు లా వంగిన పూల తీగల పొద దగ్గిర ఆసీనుడయ్యాడు. ఆ పూల పొద పక్కనున్న బావిలోకి వంగిన చెట్ల కొమ్మలకు కట్టుకున్న గిజి గాని గూళ్ళు వెన్నెల కాంతిలో స్పష్టంగా కనిపించాయి. ఆ అందాలను అలానే చూస్తూ వుండగా నిద్ర పట్టేసింది. ఊదయ భానుని లేత కిరణాలు మీద పడుతుండగా వసంత కోకిల కిల కిలా రావాలకు నిదుర లేచాడు. కాల కృత్యములు తీర్చుకుని అక్కడ కింద పడ్డ రేగు పండు ను చూశాడు. అక్కడ రేగు పండు వుండిన ఎడల ఇంకా ఏమైన ఫలములు దొరుతాయేమో నని వెదికిన తరువాత బృందావనం లాంటి ఆ వనంలో అన్ని రకాల చెట్లు కనపడ్డాయి. వాటిని కడపు నిండా తిని కీలు గుర్రమెక్కి కళార ను మహా సముద్రాన్ని దాటి కొంచెం వెళ్ళగానే ఆ వాతావరణం కొత్తగా అనిపించిది. ఇదే ఆంధ్ర పర్యావరణం కాబోలు అనుకున్నాడు. తను ముందుగా వెళ్ళాలనుకున్న ఆంధ్ర దేశం రాజధాని వైపు గుర్రాన్ని తిప్పాడు. కాసేపటిలో గోల్కొండ, బుద్ధ విగ్రహం కనిపించాయి. వాటిని చూడగానే కీలు గుర్రం వింత శబ్దం ఎహెహీహీఎ అని చేసింది. విద్యార్థి కి అర్థం మయిపోయింది ఇక్కడ ఏదో వాతావరణ కాలుష్యముందని. అందుకే కీలూ బొమ్మ కూడా తన బాషలో నా గోల అర్థం చేసుకో అని అరిచింది. హైద్రాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుకు ఆరు కిలోమీటర్లు దూరంలో గుర్రాన్ని ఆపి తేలుగు నేల పై అడుగుపెట్టాడు. అక్కడనున్న పొదల ప