Showing posts with label సెటైరు. Show all posts
Showing posts with label సెటైరు. Show all posts

Tuesday, May 06, 2008

ఈ వారం సిధ్ద -- బుద్ధ (ట్వెంటీ ట్వెంటీ, డెమోక్రసీ)

:::::::::


"అయ్య గారూ .."
"చెప్పవోయ్ సిద్ధా .."


"వైరస్ కి బాక్టీరియాకి తేడా ఏంటి?"
"బాక్టీరియా దొంగయితే వైరస్ టెర్రరిస్టు. ఏంటి సైన్సు మీద పడ్డావ్. ఏ ట్వెంటీ ట్వెంటీ మీదో పడతావనుకుంటే"


"ఒక్క చెంప దెబ్బ మూడు కోట్లు ఖరీదు చేస్తుందని తెలిసినప్పట్నుండి దాని జోలికి వెళ్ళడం లేదు."
"అయినా మ్యాచ్ లు చూస్తున్నావ్ గా "


"అదీ...."
"అర్థమయింది లే చీర్ లీడర్ల కోసం"


"అది కాదు! మన దేశం లో అలాంటి బీదా బిక్కి బట్టలేసిన డ్యాన్సులు ఎందుకు ప్రవేశ పెట్టారు? ఏ సంప్రదాయ నృత్యాలో పెట్టొచ్చు గదా"
"వాళ్ళు వేసుకునే డ్రెస్సులకూ మ్యాచులకీ అవినాభావ సంబందం వుందోయ్"


"డ్రెస్సులకూ, మ్యాచులకూ సంబంధమేంటండీ. జార్జి బుస్షు లా మట్లాడ తారు. మరీ విడ్డూరం కాకపోతే."
"మొదట్లో అయిదు రోజుల మ్యాచులు వుండేవా? అందరూ వాటిని చూసి ఆనందించేవారా. ఎక్కువ ఆనందం కోసం తరువాత 60 ఓవర్ల వన్డే లొచ్చాయా? అవి కాస్తా 50 ఓవర్లయ్యాయా. ఇప్పుడు వాటిని ఇరవై చేశారు. ఆ ఇరవైకి తగ్గట్టే డ్రెస్సులు వేసుకుంటున్నారు."


"అయితే 5 ఓవర్ల మ్యాచులొచ్చినప్పుడు ఏ గొట్టం గాడు టీములో వున్నా స్టేడియం అంతా నిండి పోతుందన్నమాట"
"అవును అప్పుడు నువ్వు టీం లోకి వెళ్ళొచ్చు "


"!!!!!"
"అలా నోరు వెళ్ళ బెట్టకు కాస్త ముయ్. వైరసులు వెళ్ళగలవు లోపలికి. వెళ్ళి ఆ మూడు పత్రికలు తీసుకొని రా"


"ఇది గోండి చదువు కోండి. నేను పత్రికలు చదవడం మానేస్తున్నా."
"ఏరా నీ మీద సెటైరేసినందుకు ఫీలవుతున్నావా? నా మీద కూడా వేస్తుంటావు కదా సె..టై..ర్లు.."


"అది కాదండీ, ఇంతకు ముందు ఏ రాజకీయ నాయకులో, ఏ ప్రజా సంఘాల నాయకులో తిట్టుకునే వళ్ళు. ఇప్పుడు ఈ పత్రికలోళ్ళు తిట్టు కోవడం మొదలు పెట్టారు."
"దీనికే అలా 'ఆ రెండు' పత్రికలంటే పడని వై.ఎస్. లాగా అయిపోతే ఎలా? ఇప్పుడు ఇరవై నాలుగ్గంటల తరువాత వచ్చే తిట్లే చూస్తున్నావ్. రేపో మాపో సాక్షి తరఫున ఓ టి.వి. చానెల్ వస్తుంది. అందులో వాళ్ళు గంటకో సారి, నిముషాని కోసారి ఒకర్నొకరు తిట్టుకుంటారు అప్పుడేం చేస్తావ్?"


"అందుకే టి.వి. కనిపెట్టిన వాడు తెలివిగా రీమోట్ కూడా కనిపెట్టాడు."
"నీ తెలివికి టోపీలు తీసేశాం"


"రెండు రూపాయలకి కిలో బియ్యం, రెండు రూపాయలకి పేపరూ వస్తున్నాయి కదా. ఇంకా రెండు రూపాయలకేమేమి వస్తాయి?"
"రెండు రూపాయలకే దహన క్రియలు"


***:O:***


"అయ్యా డిప్లమసీ అంటే ఏంటి?"
"భారత్ లో మధ్య తరగతి వాళ్ళు ఎక్కువ అన్నం తినబట్టే బియ్యం ధరలు పెరిగాయన్న బుష్ గురించి మాట్లాడమని మన్మోహన్ సింగు నడిగితే 'నో కామెంట్' అన్నాడు. అదే డిప్లమసీ"


"ఓహో. మన మనసులో నున్న భావాన్ని డీప్ గా మసి చెయ్యడమన్న మాట. మరి డెమొక్రసీ అంటే"
"ముందు మంచి చేస్తున్నట్టు డెమో ఇచ్చి తరువాత రక్కసి లా దోచు కోవడం. ఇంకా చెప్పాలంటే పాద యాత్ర చేసి నడిచినంత దూరం వేరే పాదాలు నడవకుండా నరికెయ్యడం."


:::::::::

Monday, March 10, 2008

ఈ వారం సిధ్ద -- బుద్ధ( రాజీనామాలు, కిలారి పాల్)

...


"అయ్యగారూ నా బ్యాటూ బాలూ కనిపించడం లేదు. మీరేమన్నా చూశారా?"

"చూశారా కాదు దాచేశారా అని అడుగు బావుంటుంది. మనోళ్ళు ఆస్ట్రేలియా మీద గెలిచినందుకు పది కోట్లిచ్చారు గదా. అది చూసి మళ్ళీ నువ్వు గోచీ ఎగ్గడతావని వాటిని దాచేశా."

"మీకు నేను పైకి రావడం ఇష్టం లేదు లాగుంది. ఇలాగయితే నేను రాజీనామా చేసేస్తా. "

"నీ టర్మేమీ అయిపోలేదు నువ్వు రాజీనామా చెయ్యడానికి. ఇంకా ఓ ముప్పై ఏళ్ళు ఉద్యోగం చెయ్యొచ్చు. నీ పదవికొచ్చిన నష్టమేమీ లేదు గానీ పొలం లో పనిచెయ్యడానికి కూలీలను పిలిచావా లేదా?"

"మన చేనులో పని చెయ్యడానికి కూలీలు ఎవ్వరూ రావటం లేదండి"

"ఎందుకురా? మనమేమీ తక్కువ కూలీ ఇవ్వడం లేదు కదా. రోజుకు 100 రూపాయలు ఇస్తున్నాం కదా. రావడానికేం? కొంపదీసి నువ్వు ఇన్‌స్పైర్ అయిపోయి కమీషన్ నొక్కెయ్యడం లేదు గదా?"

"నేనేదో సూరీడు అయినట్టు మీరు వై.ఎస్. అయినట్టు ఫీలింగొకటి. నాకంత అదృష్టమా చెప్పండి. అందరూ తెలివి మీరి పోయారు."

"తెలివి మీరడమెంటి ఏమీ పని చెయ్యకుండా డబ్బులొచ్చేస్తున్నాయా ఏంది?"

"ఇందిరమ్మ ఉపాధి హామీ పథకం కింద 100 రూపాయలు ఇచ్చేస్తున్నారు గదా "

"మనమిస్తోంది అంతే కదా"

"అక్కడే మీరు కేరెట్ తిన్నారు. మన దగ్గరికొస్తే రోజంతా కష్టపడాలి. అక్కడికెళితే పని చేసినా చెయ్యక పోయినా రికార్డుల్లో పేరు రాసుకుంటే చాలు నూరు రూపాయలొస్తుంది."

"ఏంటి అంత సులభంగానా? అందరికీ ఇస్తున్నారా?"

"అక్కడే కొంచెం తేడా వుంది. కాంగ్రేసు సానుభూతి పరులకు బేషుగ్గా ఇస్తున్నారు. ఇంకొంత మంది అలా నటిస్తూ అటు వైపే వెళ్ళి పోతున్నారు."

"ఇలాగయితే కొద్దో గొప్పో భూములున్న రైతులెలా బతుకు తారు?"

"అయిదెకరాల కన్నా ఎక్కువున్న రైతులకు ఋణాల మాఫీ లేదు కదా. వాళ్ళు వున్నదమ్ముకోని జై కాంగ్రేస్ అని అందులో చేరి పోతారు."

"ఏ రకంగా చూసినా కాంగ్రేస్ కే అనుకూలమన్న మాట. ఇలాంటివి బయటకు రావటం లేదా?"

"వస్తున్నాయి. ఇలాంటి వార్తలు వచ్చినందుకే రాసిన విలేఖరులు జె.సి.దివాకర్ రెడ్డి మీటింగుల నుండి గాల్లో లేచి బయటికి వచ్చారు. కొన్నాళ్ళాగితే ఇంకొంచెం పైకి పోతారు. అందుకే పై లోకాల నుండి మాలాంటి వారిని ఆదుకోడానికి ఒక మనిషి వచ్చాడు."

"ఏదో కొత్త విషయం లాగుందే. "

"మీకు కొత్తగానే వుంటుంది. మాలాంటోళ్ళకు అది పాతదే. మా లాంటి దీనులను, అభాగ్యులను ఆదుకొనే దీన జన బాంధవుడు వస్తున్నాడు వచ్చేస్తున్నాడు"

"ఇది పాత విషయమే నువ్వు మాట్లాడేది వై.ఎస్.గురించే. ఆ ఆంధ్ర ప్రదేశ్ సమాచార శాఖ చూపించే ప్రకటనలు చూస్తే అందరు ముఖ్యమంత్రులు ఇలాగే అనిపిస్తారు."

"చా! వై.ఎస్. గురించి ఎవరు చెప్పారు మీరే అలాంటివి చూసి పడి పోతారు. నేను మాట్లాడేది ఆయన గురించి కాదు"

"ఇక మిగిలిందెవరు చిరంజీవే"

"నన్ను క్రికెట్ పిచ్చంటారు గానీ మీకే ఆ రాజకీయాల పిచ్చి ఎక్కువ అందుకే చిరంజీవి అంటున్నారు.మీరిప్పుడు కేరెట్ కేక్ తిన్నారు."

"వైఎస్సూ, చిరంజీవి కాకుండా ఇంకెవరబ్బా..ఆ గుర్తొచ్చింది. లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ్"

"ఈ సారి కేరెట్ హల్వా తిన్నారు. నేను మాట్లాడేది మా దీన సందు పార్టీ నేత కె.ఏ.పాల్ గురించి"

"ఓహో ఆయనా? ఎన్నారై పార్టీ అన్నమాట. ఏదో సందు చూసుకుని పార్టీ పెట్టినట్టు అది దీన సందు అంటావే. అది దీన బంధు అనుకుంటా"

"ఏదో ఒక గొంది.అందుకే అందులో కెళ్ళి ఇరుక్కుందామనుకుంటున్నా."

"ఏందుకో?"

"చేరితే నన్ను ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు."

"చిరంజీవిని చేస్తానన్నట్టున్నాడు"

"అయితే ఉప ముఖ్యమంత్రి నవుతా."

"దాసరి తీసిన ఎమ్మెల్యే ఏడుకొండలు సినిమా చూశావా?"

"లేదు. ఏం అందులో నాలాంటోడు ముఖ్యమంత్రి కానీ అవుతాడా ఏంది?"

"అలాంటిదే. ఒక బడుగు వాడైన దాసరి, ముఖ్యమంత్రి అవడానికి ఎగస్పార్టీ ఎమ్మెల్యేలందరికి ఉప ముఖ్యమంత్రి పదవిస్తానని ఆశ పెడతాడు. దానితో సిగ్గు లేని వెధవలందరూ వాళ్ళ పార్టీ జెండా ఎత్తేసి ఈ పార్టీలోకి వచ్చేస్తారు."

"అంటే అవతలి పార్టీ నాయకుడికి కూడా?"

"వాడికి మాత్రం ప్రత్యేకమైన పదవి ఇస్తాడు."

"అదేదో చెప్పండి నేను ఆ పదవి ఇమ్మని అడుగుతా."

"అది ముఖ్య ఉప ముఖ్యమంత్రి పదవి "

"నన్ను బాగా ఇరికిస్తారే? ఇలానే అంటూ వుండండి ఏదో ఓ రోజు మా చిరంజీవి పార్టీ పెట్టి పాద యాత్రో, చేతి యాత్రో అంటాడు అప్పుడు నేను జంపు జోగయ్య అవుతా."

"చేతి యాత్రలు కూడా వున్నాయా?"

"నడిచి వెళ్ళి ప్రజలని చూస్తే అవి పాద యాత్రలు. హెలికాప్టర్లో వెళుతూ గాల్లో నుండి చెయ్యి ఊపితే అవి చేతి యాత్రలు."

"ఇంకా నయం కూడలి చాట్ రూము లో కొచ్చి ప్రచారం చేసుకుంటే ఛాట్ యాత్ర, బ్లాగు సమావేశాల్లోకొచ్చి చెబితే బ్లాగు యాత్ర అని చెప్పలేదు"


***




"ఇప్పుడు రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏంచేస్తారు."

"వచ్చే ఏలక్షన్స్ లో పోటీ చేస్తారు. ఓ నాలుగు సంవత్సరాల తరువాత మళ్ళీ రాజీనామా చేస్తారు.జాబ్ సెక్యూరిటీ."


**



"వై.ఎస్. తను కడపను మాత్రమే అభివృద్ధి చేస్తున్నాడనే ఘోరాతి ఘోరమైన నిందను పోగొట్టుకొని ఆంధ్ర ప్రదేశ్ అంతా అభివృద్ధి చెయ్యాలంటే ఏమి చెయ్యాలి?"

"ప్రధాన మంత్రిని చెయ్యాలి."


:::::::


Monday, February 25, 2008

ఈ వారం సిధ్ద -- బుద్ధ (క్రికెట్, ఉండవల్లి)




"రేయ్ సిద్ధా, ఓ సారిలా రా?"
"......"

"రేయ్ సిద్ధా, ఎక్కడున్నవ్ రా? ఏంటి వంటింట్లో లేడు కంప్యూటర్ రూములో లేడు ఎక్కడికెళ్ళాడు? రేయ్ సిధ్ధిగా ఎక్కడ చచ్చావ్ రా?"
"....."


"ఏంటిది వరండాలో కూడా లేడు…. ఓర్నీ ఇక్కడ రోడ్లో ఆ క్రికెట్టేందిరా ఇది క్రికెట్టాడే వయసా? ఆ బ్యాటూ బాలూ అక్కడ పడేసి లోపలికి రా"
"చా పొండయ్యగారూ నేను సక్కగా కిరికెట్టు నేర్చుకుంటుంటే మీకు కుళ్ళు గా వుంది. కావాలంటే మీరు కూడా రండి ఇద్దరం కలిసి ఆడుకుందా. నేనిప్పుడే దోసె రా ఎట్లా ఎయ్యాలో నేర్చుకున్నా. మీరు బ్యాటు పట్టుకోని నిలబడుకోండి. చూపిస్తా."

"అది దోసె రా కాదు రా దూస్రా. నీ దూస్రా పిచ్చుకలెత్తుకెళ్ళ. వెంటనే వచ్చి ఓ దోసె పడెయ్ నాకు."
"అది కాదయ్య గారూ, కావాలంటే మీరు బౌలింగ్ చెయ్యండి నేను రివర్సు స్వీటు షాటు ఎలా చేస్తానో చూపిస్తా"

"నీ అర్ధ క్నాలెడ్జి తగలెయ్య. అది రివర్సుస్వీప్ షాట్, రివర్సు స్వీటు కాదు. ఈ లెక్కన ఎల్బీడబ్ల్యూ ని లడ్డూ జిలేబి, సిల్లీ పాయింటు ను చిల్లీ చికెను అని క్రికెట్ మొత్తాన్ని డైనింగ్ టేబుల్ చేసేట్టున్నావ్. ఆ బ్యాటు అక్కడ పడేసి రా."
"అది కాదండి నేను పెద్ద క్రికెటరయితే మీరు హాయిగా ఇంటి పట్టున కూచోని మ్యాచు ఫిక్సింగ్ చేసుకో వచ్చు కదా."

"మ్యాచు ఫిక్సింగులా అదేమన్నా కేకు మిక్సనుకున్నావా? నీ మూతికి బాలు ఫిక్సుకాకుండా చూసుకో. అసలు నీకు క్రికెట్టాడే వయసా ఇది?"
"అదేంటండి అట్లంటారు. జయసూర్య కు 37, కుంబ్లేకి 36, సచిన్ కు 35. నాకు 15 ఏళ్ళకే పెళ్ళి చేసారు కాబట్టి పెద్ద పిల్లలున్నారు కానీ. నా వయసు 34 కదా. క్రికెట్టాడ్డానికి ఏం తక్కువని?"

"నీ లెక్కలు బానే వున్నాయి కానీ. నీకు శరద్ పవార్ కానీ, లల్లూ ప్రసాద్ యాదవ్ కానీ తెలుసేమిటి?"
"అబ్బే తెలీదండి."

"అయితే బాగా మసాలా పట్టించి పప్పుల పోడేసి వెన్న రాసి రెండు మాసాలా దోసెలు పట్టుకురా వంటింట్లోకెళ్ళి. "
"అలాగే అయ్యగారూ" అని గుర్రు మని చూసుకుంటూ వెళ్ళిపోయాడు.


**


"మసాలా దోసె బ్రహ్మాండగా చేశావు. పోయిన వారం బ్లాగులన్నావ్ ఈ సారి క్రికెట్టంటున్నావ్.నీకు ఈ క్రికెట్ మీద మనసెందుకు పోయింది? "
"నేను చిన్నగా వున్నప్పుడెప్పుడో మా ఊర్లో రాత్తురుల్లో బట్టలు ఏలం ఏసేవాళ్ళు. రెండు కిరసనాయిలు బుడ్డీలు ఆపక్కొకటి, ఈ పక్కొకటి పెట్టి మధ్యలో గుడ్డలు పరిచి అమ్మేవోళ్ళు. ఏలం పాట చెబితే మా ఊర్లో ఆడోళ్ళు మగోళ్ళు రెట్టలు ఎగేసుకోని భలే పాడే ఓళ్ళు లే. ఇప్పుడు సేం టూ సేం. గుడ్డల బదులు కిరికెట్టు ఆడే ఓళ్ళు... మా ఊర్లో రెట్టలెగేసుకునే వాళ్ళ కు బదులు కోట్లేసుకున్నోళ్ళు. ధోనీని ఆరు కోట్లకు, ఇషాంత్ నాలుక్కోట్లు, ఆండ్రో సైమండ్స్ అయిదున్నరకోట్లు, ఒకట్రొండు మ్యాచులాడిన మనోజ్ తివారిని కూడా రెండున్నర కోట్లకు ఏలం పాటలో పాడేసుకున్నారు కదా. నేను కూడా కిరికెట్టు నేర్చుకుంటే నన్ను కూడా ఏలం లో పాడుకుంటారు కదా "

"వాళ్ళందరి లక్కూ అలాంటిది మరి. మనోళ్ళెవరికైనా బాగా డబ్బొచ్చిందా?"
"మన వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్ కు వచ్చింది ఒకటిన్నర కోటే పాపం"

"అయ్యో అంత తక్కువా?"
"ఏం లేదు తనకి దిగ్గజం హోదా వస్తే అయిదు కోట్లకు పైగా ఇవ్వాల్సి వస్తుంది. అంత డబ్బు పెట్టే బదులు తాను కేప్టన్ అయిన హైదరాబాద్ కు మంచి ఆటగాళ్ళను కొనుక్కోవచ్చు కదా అని."

"ఇట్లాగే మంచికి పోతే ఏదో ఒక రోజు టెస్టుల నుండి కూడా పీకేస్తారు. "


***


"అయ్యగారూ, మీకు జంతువులు మాట్లాడే భాష తెలుసా?"
"తెలీదు రా"

"పక్షులు మాట్లాడే భాష తెలుసా? "
"పక్షుల భాషే కాదురా అక్కుపక్షీ! చేపల భాష కూడా తెలీదు. ఇంతవరకు ఏ జంతువు భాషా శాస్త్రజ్ఞులు కూడా కనిపెట్టలేదు."

"మరి మొన్న వై.ఎస్. అసెంబ్లీ లో చంద్ర బాబును పట్టుకుని అసలది మనుషులు మాట్లాడే భాష కాదు అని స్పష్టంగా ఎలా చెప్పగలిగాడు?"
"నాకు తెలీదు ఆయనకు ఆంధ్ర దేశంలో వున్న ఆడవాళ్ళనందరినీ లక్షాధికారులు, దళితులనందరినీ టాటా, బిర్లాల లాగా చేసే శక్తులు వున్నాయన్నాడు గదా. అంత గొప్పోడికి జంతు జాలాలు మాట్లాడే భాష కూడా వచ్చేమో?"

"కాకా ఇంట్లో విందుకు పోయినప్పుడు ఏ భాష మాట్లాడుంటారంటారు?"
"ఏదయినా గానీ రాయలసీమ భాష మాత్రం మాట్లాడుండడు.వై.ఎస్.కి చాలా భాషలు వచ్చు "

"ఉండవల్లి రాజమండ్రి లో ఏ భాష వాడాడు?"
"ఒకటి తెలుగు దేశం భాష , ఇంకోటి కాంగ్రేస్ భాష."

"అవి పార్టీలు కదా వాటికి భాషలేంటి?"
"అంటే వాళ్ళు మాట్లాడే మాటలు ఏ స్పీకర్ లోనుండి వస్తే అది ఆ పార్టీ వాళ్ళ బాష. సపోస్ తెలుగుదేశం వాళ్ళ స్పీకర్ నుండి వచ్చిందనుకో అది 'దురదృష్ట వశాత్తు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించాడు. ఇప్పుడు దాన్ని ఆచరించక తప్పని పరిస్థితి' అని చెప్తుంది. ఆదే కాంగ్రేస్ వాళ్ళ స్పీకర్ నుండి వస్తే తెలుగు దేశం వాళ్ళని ఉద్ధేశిస్తున్నట్టు '(మీ) దురదృష్టం, అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించాడు. ఇప్పుడు దాన్ని ఆచరించక తప్పని పరిస్థితి ' అని వినిపిస్తుంది."

"ఇందులో ఎవరిది నిజం ఎవరిది అబద్ధం?"
"అలాంటి వాటికి జవాబు చెప్పడానికి పడవల్లో నుండి, కూచిపూడి నుండి, కుండల్లో నుండి వెలికి తీసి నిష్కర్షగా నిజాలను చెప్పే పత్రిక వస్తోంది. అందుకు నువ్వే సాక్షి."



Wednesday, November 21, 2007

అఖిల భారత రౌడీల మహా సభ

ఆకు రౌడీలు, చాకు రౌడీలు ,ఘరానా రౌడీలు, పురానా రౌడీలు, రిటైర్డ్ రౌడీలు,రెలిజియెస్ రౌడీలూ,మెగా రౌడీలూ, మోడు రౌడీలు,వీధి రౌడీలు అందరూ వచ్చారు..వస్తున్నారు. ఈ సారి మహా సభల ప్రత్యేకత సైబర్ రౌడీలు కూడా వీళ్ళతో కలవడం. ఏ ఒక్కరు కానీ తమ సొంత వాహానాల్లో సభా ప్రాంగణానికి రావడం లేదు. అన్నీ కొట్టుకొచ్చినవి లేదా ఓనరును కొట్టేసి తీసుకు వచ్చినవి. సభా నియమాల ప్రకారం అందరూ తమ దుస్తులును వదిలేసి సభా నిర్వాహకులు ఇచ్చిన నలుపు చారల దుస్తులు వేసుకుని లోపలికి వెళుతున్నారు. వాళ్ళ వదిలేసిన దుస్తులు గోడకున్న కొక్కానికి వేలాడ దియ్య బడ్డాయి.

ఎంత రద్దీ వున్నా ఎవరూ ఎవరినీ తోసుకుని ముందుకు వెళ్ళడము లేదు. ఓపికగా ఒక క్రమ పద్ధతిలో నడుస్తున్నారు. వచ్చిన వాళ్ళ బ్యాడ్జ్ నంబరు ప్రకారం వారి సీట్లో వారు కూర్చుంటున్నారు. ముందు వచ్చిన వాళ్ళకు ముందు సీట్లు వెనక వచ్చిన వాళ్ళకు వెనక సీట్లు ఇస్తున్నారు. అందరూ తమ పక్కన కూర్చున్న వాళ్ళతో ఉల్లాసంగా మాట్లాడుతూ తాము ఎన్ని మర్డర్లు చేశారో, ఎన్ని దొంగతనాలు చేశారో చెప్పుకుంటూ సరదాగా ముచ్చటంచుకుంటున్నారు. కొందరు తాము ఎంత తొందరగా మంత్రి పదవి, ముఖ్యమంత్రి పదవి చేపట్టామో విపులంగా చెబుతున్నారు. కుర్ర రౌడీలు అలాంటి వారి దగ్గర ఆటోగ్రాఫులు లైన్లో నిలబడి తీసుకుంటున్నారు.

అందంగా వున్నా ఆడ రౌడీల వెనక ఏ మగ రౌడీ కూడా వెంట బడటం లేదు. ఆ సభకున్నా నీతి నియమాల్ని ఏ ఒక్కరూ అతిక్రమించడం లేదు. కొత్తగా సభ్యులయిన వారు తెలియక చేసే కొన్ని పనులకు సుతారంగా హెచ్చరించి వదలి వేస్తున్నారు.

సభ ప్రారంభమయ్యే అర గంట ముందు రౌడీ మహా సభ నాయకుడు ఆ ప్రాంగణమంతా కలియ దిరుగుతూ అందర్ని పలకరిస్తున్నాడు. వేదిక మీద చెప్పే గణాంకాల కోసం అందరూ విప్పేసిన దుస్తులు వున్న గదిలోకి వచ్చాడు. అక్కడ చాలా రంగుల చొక్కాలు వున్నాయి. తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, గులాబీ, నలుపు ఇలా భారత దేశంలో వున్న అన్ని పార్టీల రంగులు కనపడ్డాయి. ఎక్కువమంది బీహారు నుండీ, ఆ తరువాత ఆంధ్ర ప్రదేశ్ నుండి వచ్చినట్టు గమనించాడు. పక్క రాష్ట్రం కర్నాటక నుండి కొంత మందే వచ్చినట్టు గమనించి "ఏంటి ఈ మన కర్నాటక రౌడీ సోదరులు సాఫ్టువేరు కంపెనీలు గానీ తెరిచారా ఈ సారి చాలా తక్కువ మంది వచ్చారు " అని అడిగాడు.

పక్కనున్న అనుచరుడు అందుకొని "అన్నా అక్కడ మన వాళ్ళకు మంచి పని దొరికిందన్నా మనొడెవడో ముఖ్యమంత్రి పదవికి ట్రై చేస్తున్నాడు అందుకనే మన రాయల సీమ రౌడీ సోదరులు కూడా బెంగళూరు వెళ్ళి పోయినారన్నా. మూడో రోజు ముగింపు సమావేశాలకు వచ్చేస్తారన్నా" అని చెప్పాడు.


సభ మొదలయింది. సభాధ్యక్షుడు మైకు తీసుకుని “తోటి రౌడీ సోదరసోదరీమణులకు ఇక్కడికి విచ్చేసినందుకు చోర నమస్కారాలు. ఎప్పట్లాగా మన నీతి నియమాల గురించి మొదట మొదలు పెడతాను. మన మందరం ఎప్పట్నుండో ఐకమత్యంగా వుంటున్నాం. అలాగే వుండాలి కూడా. మనం మనల్ని దోచుకోకూడదనే విషయం మనందరికీ తెలిసిందే. కొంత మంది తమకు సరయిన జరుగుబాటు లేకపోవడం వల్ల అంటే స్ట్రిక్టుగా వుండే పోలీసులు, ప్రభుత్వాలు వుండే చోట వుండడం వల్ల. క్షుద్భాధ ను ఆపుకోలేక ఈ సభా ప్రాంగణానికి వచ్చి తోటి సోదరుల వస్తువల్ని తస్కరించి వుండ వచ్చు. అలా ఎవరూ చేయరని అనుకుంటున్నాను. తమకు తెలియక అలా చేసి వుంటే వెంటనే తాము కొట్టేసిన వస్తువులను వాళ్ళ యజమానికి తిరిగి ఇచ్చివేయమని కోరుకుంటున్నాను” అన్నాడు.

యాభై వేల మంది హాజరయిన ఆ సభలోనుండి ఒక వ్యక్తి లేచి నిలబడి కళ్ళ నీళ్ళ పర్యంతమై “అన్నా ! మా ఏరియా లో వుండే ఎస్పీ చాలా స్ట్రిక్టు. అందువల్ల ఏమీ చెయ్యలేక పూటకు కూడా గడవడం లేదు. అందువల్లే నేనీ రౌడీ కుల ద్రోహానికి ఒడి గట్ట వలసి వచ్చింది. నన్ను నిలువునా చంపేసి నా కళ్ళూ, కిడ్నీలు వృత్తి ధర్మం చేస్తూ విధి నిర్వహణలో ఉంటూ వాటిని కోల్పోయిన వాళ్ళకు బహూకరించండి.” అని భోరున విలపించి తాను కొట్టేసిన బంగారు బ్రేసులెట్, డైమండ్ నెక్లీస్ యజమాని దగ్గరికి వెళ్ళి ఇవ్వబోయాడు.

ఆ యజమాని వెంటనే అతన్ని కోగలించుకొని “రౌడీ సోదరా! ఈ నగలు నువ్వే వుంచుకో. ఒక రౌడీకి ఇంకో రౌడీ సాయం చేసుకోకుంటే ఎలా. మనమేమన్నా రాజకీయ నాయకులమనుకున్నావా? మనం బతుకు దెరువు కోసం మాత్రమ రాజకీయ నాయకులం. ఇక్కడ కాదు” అని ఇంకో సారి గట్టిగా కౌగలించుకుంటే అతని నడుముకున్న జర్మన్ మేడ్ పిస్టల్ తగిలి బలహీన రౌడీ “అబ్బా” అన్నాడు.

“క్షమించు తమ్ముడూ” అని తన పిస్టల్ తీసి ఆ బలహీన రౌడీకి ఇచ్చాడు మంచి పద్యం చెప్పిన కవికి మహరాజు మణిహారాన్నిచ్చినట్టు.

సభంతా కర తాళ ధ్వనులతో మార్మోగి పోయింది. సభాధ్యక్షుడు మైకి తీసుకు “అన్ని తూటాలుంటే కొన్ని తూటాలివ్వవోయ్ అని చాటి చెప్పిన చంబల్ మంగళ్ సింగ్ మాటల్ని ఆచరించి చూపిన ఇలాంటి వారే మన రౌడీ వంశానికి స్పూర్తి. ఇతనికి వచ్చే సమావేశాల్లో చోరాదరణ్ సామ్రాట్ బిరుదును ఇవ్వడానికి కృషి చేస్తా. మరొక్క సారి చప్పట్లు కొట్టండి” అని చెప్పి తన సెక్రెటరీని పిలిచి ఆ బలహీన రౌడీ వున్న ఏరియాలో పని చేసే ఎస్పీ పేరు నోట్ చేసుకోమన్నాడు.

“పోయిన సారి సభలు జరిగినప్పుడు ఇలాంటి వాళ్ళు ముగ్గురే వున్నారు. ఈ సారి అది ఒకటికి చేరింది. వచ్చే సభలకు ఇలాంటి బలహీన రౌడీలున్న ఇల్లే లేకుండా చేయడం మన ప్రధాన లక్ష్యం. ఈ సభలోనే కాదు మన సంఘంలో చేరిన ఏ ఒక్కరూ ఇలాంటి దుస్థితికి రాకూడదు...రాకూడదు..రా... ” అని చెప్పి కళ్ళు తుడుచుకున్నాడు.

"ఇక సభను ప్రారంభించబోయే ముందు ఈ సభ నిర్వహణ కోసం పగలనక రాత్రనక పని చేసి, పగలు నిద్ర పోకుండా వున్నందు వల్ల తన అరోగ్యం పాడయినా, తన ఆదాయానికి గండి పడ్డ లెక్క చేయక ఒంటి చేత్తో ఇక్కడ హైదరబాదులో వున్న వాళ్ళను అదిలించి బెదిరించి అన్ని సౌకర్యాలను సమకూర్చిన 'బ్యాంకు బొక్కల' దుడ్డు దుర్మాగ రాయుడిని సభా ముఖంగా ప్రశంశిస్తూ అతనికి ఏ.కె.47 ను బహూకరిస్తున్నాము” అని పిలవగానే దుడ్డు దుర్మాగ రాయుడు వేదిక మీదకు వచ్చి ఆ ఏ.కె.47 ని తీసుకొని కళ్ళకు అద్దుకున్నాడు.

చమరుస్తున్న కళ్ళతో “నాకు ఇచ్చిన ఈ ఏ.కె.47 ను మన రౌడీ సోదరులెవ్వరి మీద ప్రయోగించనని నిండు సభలో ప్రమాణం చేస్తున్నాను.ఎంగిలి మెతుకులు తింటూ పిక్ పాకెటర్ గా మొదలు పెట్టిన ఈ జీవితంలో ఎన్నో ఆటుపోట్లకు గురయ్యి ఇప్పుడు ఈ ఎమ్మెల్యే స్థాయికి చేరాను. మీ అండ దండలు ఇలానే వుంటే నేను ముఖ్యమంత్రి అయిన తరువాత రౌడీల కోసం ఒక ప్రత్యేక మైన్ సెల్ ఓపన్ చేసి కొత్తగా వృత్తి లో చేరుతున్న వారందరికి ఉచితంగా కత్తులూ, బ్లేడులు సప్లై చేస్తా.జై చోర సామ్రాజ్ ” అని ఏ.కె. 47 ను భుజానికి వేసుకొని వేదిక దిగాడు.

అక్కడ వున్న సామాజిక శక్తి పత్రిక విలేఖరి వెంటనే తన నోట్ బుక్ తెరిచి అందులో "ఆకలి పేగులతో , మాడిన కడుపులతో,ఎండిన గుండెలతో ఒక బాలుని రౌడీ జీవిత నిజ గాథ" అనే హెడ్లైన్‌తో న్యూస్ ఐటం తయారు చెయ్యడంలో నిమగ్నమైపోయాడు.

సరిగ్గా అప్పుడే సభా ప్రాంగణంలోకి కొన్ని హెలికాప్టర్లు దిగాయి. అందులో నుండి దిగితున్న వారిని రిసీవ్ చేసుకోడానికి కొంత మంది అటు వైపు వెళ్ళారు.

సరిగ్గా అదే సమయానికి సి.ఎన్.ఎన్. లో బ్రేకింగ్ న్యూస్
"ఇండియాలో కొన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులు ఏక కాలంలో కనిపించుట లేదు"

(సశేషం)

Monday, November 05, 2007

రైతుల పాడి పంటల కోసం అసెంబ్లీ (లో) రాజకీయుల "పెంట" పొలాలు.




పొలం కబుర్లు:


పంటలు పాడవకుండా చేనుకు చేవ రైతుకు దిగుబడి కావాలంటే మీ పొలంలోకి వచ్చే ఇతర కోడె గిత్తలను ఇలా బాగా కడిగిన తరువాత అలా నోరు ముయ్యాలి. మీ ఇతర పశువుల నుండి వచ్చే పేడతో ఆ కోడె గిత్తలమీద మెత్తగా గుండ్రంగా వేసి పిడకల కోసం వేస్తున్నామని భావించాలి.


Wednesday, October 10, 2007

ప్రభుత్వ కప్ ట్వెంటీ(ట్వెంటీ-11)

.

కొత్తగా కట్టిన రాజీవ్ గాంధి (ఉప్పల్) స్టేడియం.

క్రిక్కిరిసిన జనసందోహం. గాలి కూడా మాట్లాడ్డం ఆపేసింది. కూలి పోవాలనుకున్న బ్రిడ్జిలు ఆగిపోయాయి. పేలి పోవాలనుకున్న బాంబులు పేలడం మానేసాయి.

చివరి ఓవర్…

చివరి బాల్….

చివరి వికెట్…

గెలవటానికి కావలసినవి అయిదు పరుగులు. కొడితే సిక్సే కొట్టాలి.

క్రీజులో పించ్ హిట్టర్ వై.ఎస్. పంచ ఊడిపోతుందేమోనని అంపైర్ అనుమతితో బెల్టు తెప్పించుకొని దాని మీద వేసుకున్నాడు. బెల్టు తెచ్చిన సూరీడు వికెట్ల వెనక కీపింగ్ చేస్తున్న మైసూరా రెడ్డిని కొర కొరా చూశాడు వై.ఎస్. ఎక్కడున్నా వెనకుండే తన బదులు ఎవరో వుండడం చూసి ఓర్వలేక. సూరీడు వై.ఎస్. తాగేసిన నీళ్ళ బాటిల్ తీసుకొని బయటకొచ్చేశాడు. వై.ఎస్. 99 మీదున్నాడు.


అవతలి టీం కెప్టెన్ అయిన చంద్ర బాబు ఫీల్డింగ్ సరి చేస్తున్నాడు. సీనియర్ క్రికెటర్లయిన దేవేందర్ గౌడ్, ఎర్రం నాయుడులు సలహాలు ఇద్దామా వద్దా అని ఆలోచించి ఎందుకొచ్చిన గొడవలే అని చెబితే హరికృష్ణకు చెబుదాం అని వెళ్ళి వై.ఎస్. కు ఏ వైపున బాల్ వేస్తే దొరికిపోతాడో చెప్పారు.

హరి కృష్ణ వెంటనే చంద్ర బాబు దగ్గరికెళ్ళి “బావా! నువ్వు ఈ బాల్ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ వేస్తే వై.ఎస్. ఈజీగా దొరికిపోతాడు” అని చెప్పాడు.

“నేను మారాను అని చెప్పినంత మాత్రాన అందరి సలహాలు తీసుకుంటున్నట్టు కాదు. మామూలు బౌలింగ్ బదులు రౌండ్ ద వికెట్ బౌల్ చేస్తానని అర్థం. పేస్ లోనూ, లెంగ్త్ లోనూ తేడా వుండదు.” అని చెప్పి వికెట్ కీపర్ కి వెనకాల బౌండరీ లైను దగ్గర వెళ్ళి నిలబడ మన్నాడు.”నేను స్లిప్స్ లో వుంటా బావా” అని చెప్పబోయి మాట్లాడలేక బౌండరీ లైను దగ్గరకి వెళ్ళిపోయాడు.


వై.ఎస్. పొజిషన్ లో నిలబడి బ్యాటును గ్రౌండ్ కేసి కొట్టి ఏదో అనుమానమొచ్చి అంపైర్ నడిగి మళ్ళీ గార్డు తీసుకున్నాడు. వెనక నుండి మైసూరా రెడ్డి స్లెడ్జింగ్ మొదలు పెట్టాడు.

“చూడుబ్బీ.. వై.ఎస్సూ! ఈ తూరి నువ్వయిపోయినావ్బో. బాల్ కొట్టే ముందు నీ పంచి చూసుకోబ్బీ అది ఊడిపోతా వుంది. ఇంగేం బాల్ కొడతావ్. బ్యాటు పైకెత్తితే పంచి కిందుంటుంది.అబ్బుడు నువ్వు పటా పట్టీల డ్రాయర్ తో ఇడుపుల పాయలో మడికి అండ గొట్టిన సీను గుర్తొచ్చుంది. ”

వై.ఎస్. బ్యాట్ను నేల కేసి దబా దబా బాదుతూ కంగారుగా ఆలోచించాడు ‘ ఇప్పుడే కదా బెల్టు పెట్టుకుంది అదెందుకు ఊడిపోతుంది ‘ అని సర్ది చెప్పుకొని తన ట్రేడ్ మార్కు గుర్తుకు రాగానే ఓ చిరు నవ్వు నవ్వాడు.


రైట్ ఆర్మ్ మీడియం స్పిన్నర్, ఆల్రౌండర్ చంద్ర బాబు బాలు కు బాగా ఎంగిలి పూసి తొడల మీద రుద్దుకుంటున్నాడు. బౌలింగ్ పాయింటు దగ్గర కెళ్ళి వికెట్ల వైపు తిరిగి పరుగెత్తుతూ ఆలోచించాడు. ఈ ఒక్క వికెట్ పడిపోతే విజయం తమదే. మళ్ళీ ఓ అయిదేళ్ళు మనల్ని ఎవ్వడూ అడగడు. ఈ సారి పాద యాత్రలకు చేతి యాత్రలకు అసలు అనుమతి ఇవ్వకూడదు ఇస్తే గిస్తే పొర్లుడు యాత్రలకు అనుమతి ఇవ్వాలి అని బలంగా అనుకున్నాడు.


అక్కడ క్రీజులో వై.ఎస్. ఫీల్డింగ్ మొత్తం చూసుకున్నాడు. కొడితే లాంగాన్ లో ఎర్రం నాయుడి మీదుగా సిక్సర్ కొట్టాలి. అక్కడ మంచి గ్యాప్ వుంది. బాల్ లో తేడా వస్తే కవర్స్ లో వున్న దేవేందర్ గౌడ్ మీదుగా సిక్సర్. దేవేందర్ గౌడ్ కు తాను పంపించిన సందేశం “క్యాచ్ వదిలేస్తే తరువాత తమ ప్రభుత్వం కాంగ్రేస్ లో చేర్చుకొని తెలంగాణా ఇచ్చేసి ముఖ్యమంత్రి ని చెయ్యడం” అందించారో లేదో అని ఓ క్షణం అనుమానపడ్డాడు.

నాన్ స్ట్రైకర్ కె.వి.పి. అసహనంగా కదులుతున్నాడు. అంతకు ముందే చంద్ర బాబు చేతిలో డకౌటైన రోశయ్య స్థానం లో వచ్చాడు.

వై.ఎస్. బ్యాట్ ఊపుతూ చంద్ర బాబు చేతుల్నే చూస్తున్నాడు. చివరి బాలు చంద్ర బాబు చేతి నుండి విడుదలయింది. అది సుడులు తిరుగుతూ లెగ్ సైడు వెళ్ళబోతూ వైడు అవుదామా వద్దా అని సందేహించింది. అంతలో వై.ఎస్. సగం పిచ్ దాటి పది మీటర్లు ముందుకు వచ్చి బ్యాటును బలంగా అడ్డంగా ఊపాడు.


మిస్సయింది.!!!


బాల్ చంద్ర బాబు మాట్లాడే స్వభావాన్ని వంట బట్టించుకుని చాలా నిదానంగా వికెట్ల దగ్గరికి వెళుతోంది. అంత పెద్ద బ్రహ్మిణి ప్లాంటుకు ఎంత వేగంగా పర్మిషన్ తెచ్చాడో అంతే వేగంగా వెనక్కి వచ్చి గింగిరాలు తిరిగుతున్న బాలును రివర్సు స్వీప్ చేసి "నీకు పావలా వడ్డీకే అప్పిస్తానే" అని బ్యాట్ తో గాల్లోకి లేపాడు. అది గాల్లో యువరాజ్ సింగ్ కొట్టిన 119 మీటర్లను దాటేసి 150 మీటర్ల ఎత్తుకు వెళ్ళి బౌండరీ లైను వైపు వెళ్తోంది.


అది చూసి కె.వి.పి. కళ్ళు మూసుకుని పరుగు కోసం పరిగెత్తాడు. వై.ఎస్. చిరునవ్వు నవ్వుతూ పరుగులు పెడుతూ బాల్ ను చూస్తున్నాడు.


మైసూరా రెడ్డి గుడ్లప్పగించి చూడ్డం తప్ప ఇంకేమీ చెయ్యలేక పోయాడు.


చంద్ర బాబు మాత్రం హరి కృష్ణ ను చూసి అరుస్తూ
“క్యాచ్..క్యాచ్… నువ్వు దాన్ని పట్టుకుంటే నీతో తెలుగయ్య.. ఈ కప్పు నేనెవ్వర్నీ పట్టుకోనివ్వను అనే సినిమా తీస్తా. అందులో ఇలియానా, త్రిషా హీరోయిన్స్ ” అన్నాడు.

“బిపాసా బసూతో ఐటం సాంగుందా..” అన్నాడు హరికృష్ణ

“కావాలంటే బ్రిట్నీ స్పియర్స్ కూడా” అరిచాడు చంద్ర బాబు

“నువ్వు ప్రధాన మంత్రయితే నన్ను ముఖ్య మంత్రిని చేస్తావా”

“కావాలంటే నిన్ను రాష్ట్రపతిని కూడా చేస్తా. ముందు ఆ బాలును క్యాచ్ పట్టు” చెయ్యి ఫ్లాట్ గా పెట్టి అరిచాడు చంద్ర బాబు.

అది విన్న హరి కృష్ణ ఆ బాలు పట్టుకోవడానికి వెనక్కి పరిగెడుతున్నాడు.

బాలు కిందకొస్తోంది…

కాలు బౌండరీ రోపు దగ్గరకెళ్తోంది…

బాలు దగ్గర కొచ్చేసింది…

కాలు బౌండరీ రోపు ను తాకుతోంది.

బాలు చేతుల్లో పడ బోతోందనగా హరికృష్ణకి కాలు రోప్ మీదుందని తెలిసింది.

ఇక అది క్యాచే అని డిసైడ్ అయిపోయి కడియం శ్రీహరి, అయ్యన్న పాత్రుడు, అశోక్ గజ పతి రాజు ఆయాసపడుతూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. స్టేడియం లో వున్న తెలుగు దేశం అభిమానులు
“క్యాచ్ టైగర్..క్యాచ్…."

"క్యాచ్..టైగర్..క్యాచ్” అని అరుస్తున్నారు.

బాలును చూస్తూ రెండుచేతులతో బాలును పట్టుకోబోతూ క్షణంలో వెయ్యో వంతు సమయంలో హరికృష్ణ రోప్ మీద కాలును తీశేశాడు. బాలు రెండు అరిచేతుల్లో పడింది. ఇక వేళ్ళు మూసుకోవడమే మిగిలింది.


వై.ఎస్. "నువ్వు చేతులు సరిగ్గా కడుక్కున్నావా లేక నన్ను
కడగమంటావా ..." అని గర్జించాడు.


……

……

అంతే

మూసుకోబోతున్న వేళ్ళు తడబడ్డాయి……

బాలు కింద బడింది.


క్యాచ్ డ్రాప్…సీతయ్య ఈ బాలును పట్టుకోలేదు.


వెంటనే తేరుకున్న హరికృష్ణ అది బౌండరీ లైనును దాటక పోతే చాలు అని కింద పడ్డ బాలు మీద సీతయ్య సినిమాలో సిమ్రన్ మీద పడ్డట్టు పడ్డాడు. సిమ్రన్ “దొంగ సచ్చినాడా “ అని తోసేస్తే పక్కకు దొర్లినట్టు ఆ బాలును పట్టుకుని మైసూరా రెడ్డి వైపుకు విసిరాడు. మైసూరా రెడ్డి దాన్ని ఒడుపుగా పట్టుకుని వికెట్లను గిరాటేసి మూడో పరుగు తీస్తున్న వై.ఎస్. ను ఆపి “వురికెత్తింది చాల్లేబ్బీ. ఇంగ కడప లోక సభ సీటు నాదే” అన్నాడు. అది చూసి కె.వి.పి. అక్కడే క్రీజులో కూలిపోయాడు.


కాంగ్రేసు అభిమానులలో కలకలం బయలు దేరింది. తెలుగు దేశం అభిమానులు జయ జయ ధ్వానాలు మొదలు పెట్టారు. స్టేడియంలో వున్న వై.ఎస్.అభిమానులు జేబులోనుండి కడప బాంబులు తియ్యడానికి సిద్ధమవుతున్నారు.


వై.ఎస్.మాత్రం యమదొంగ లో జూ.ఎన్టీఆర్ గదను ఎత్తినట్టు బ్యాట్ ను భుజం మీద పెట్టుకుని చిరునవ్వు నవ్వి, కళ్ళెగరేసి “చూద్దాం… థర్డంపైర్ ఏమి చెబుతున్నాడో చూడు” అన్నాడు. మైసూరాకి బొబ్బిలి ఎం.పి. ఎలక్షన్ సీను గుర్తుకు వచ్చింది.


జెయింట్ స్క్రీన్ మీద హరికృష్ణ బాలును క్యాచ్ పట్టుకోవడం చూపిస్తున్నారు. బాలు చేతుల్లోనుండి జారిపొవడం హరికృష్ణ దాని మీద పడ్డం కనిపిస్తోంది. ఆ షాట్ ని ముందుకు వెనక్కి చూపిస్తున్నారు. ఊహూ.. ఈ యాంగిల్ లో ఏమీ కనిపించడం లేదు. ఇంకో యాంగిల్లో చూపిస్తున్నారు. అందులో సైడు నుండి స్పష్టంగా కనిపిస్తోంది.


బాలు చేతుల్లోనుండి జారగానే గ్రౌండు మీద పడి……

పడి…

పడి…


బౌండరీ రోపును తాకి వెనక్కి వచ్చింది. కాంగ్రేస్ అభిమానుల కోలాహలం చెప్పఖ్ఖర్లేదు. దాన్ని ఫోర్ గా ప్రకటించాడు థర్డంపైర్ సురేష్ రెడ్డి. ఇంకేం స్కోరు టై అయింది.


అంపైర్లు వై.ఎస్.ను, చంద్ర బాబును పిలిచి చెప్పారు. స్కోరు టై అయింది కాబట్టి బౌలవుట్ పెడతాం అయిదుగురు బౌలర్ల పేర్లు ఇమ్మన్నారు. “బౌలవుట్ లో అయిదు కన్నా ఎక్కువ బంతులుండవ్. అది టై అయితే మరో మూడు బంతులు గట్రా లుండవు. డిఫెండింగ్ చాంపియెన్ కే కప్పు ఇస్త్తాం” అని కూడా చెప్పారు.


వై.ఎస్. తర్జన భర్జనలు పడి అగ్రెసివ్ బౌలర్ జె.సి దివాకర్ రెద్ది, స్పిన్నర్ రోశయ్య, మీడియం పేసర్ ఎమ్మెస్ సత్యనారాయణ, పార్ట్ టైం బౌలర్ బొత్స సత్యనారాయణ, స్లో బౌలర్ దాసరి నారాయణ రావు పేర్లు ఇచ్చాడు.


చంద్ర బాబు ముందుగానే ఆలోచించి పెట్టుకున్న లిస్టు ఇచ్చేశాడు. అందులో ఫాస్ట్ బౌలర్ కె.ఇ.కృష్ణమూర్తి, స్పిన్నర్ లాల్ జాన్ భాషా, స్లో బౌలర్ బాబు మోహన్, ఆల్రౌండర్ హరికృష్ణ, పార్ట్ టైం బౌలర్ కోడెల శివ ప్రసాద్ వున్నారు.


వై.ఎస్. బొమ్మ అన్నాడు. అంపైర్ టాస్ ఎగరేశాడు. బొమ్మ పడింది. వై.ఎస్. టాస్ గెలిచాడు. వెంటనే రెండువైపులా బొమ్మ వున్నా ఆ నాణాన్ని అంపైర్ జేబులో వేసేసుకున్నాడు. వై.ఎస్. అంపైర్ వైపు చూసి ఓ చిర్నవ్వు నవ్వాడు. అంపైర్ ఎవరికీ కనిపించకుండా రెండు వేళ్ళు చూపించి రెండు సార్లు టాస్ గెలిపించాను కాబట్టి నాకు రెండు సెజ్ కాంట్రాక్టులు ఇవ్వాలి అని సైగ చేశాడు. దానికి వై.ఎస్. కోడ్ బాషలో సరే అన్నాడు. తమ వాళ్ళే మొదట బోలింగ్ చేస్తారన్నాడు.


బౌలవుట్ మొదలయింది.

మొదట జె.సి దివాకర్ రెడ్డి బాలును చేతిలĺ